News

మొదట స్పందించేది నేనే:జగన్


రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా మొదట స్సందించేది నేనే అని  జగన్ అన్నారు. రైతు భోరోసా యాత్రలో భాగంగా సోమవారం అనంతపురం జిల్లాలోని రొళ్ల మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలతో విరుచుకుపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బాబు మాటలతో కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై కేంద్రం స్పందించకపోతే అరవై మంది ఎమ్మెల్యేలు ఏడుగురు ఎంపీలతో కలిసి ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఆయన పేర్కొన్నారు.